తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Terrorist Attack: ఆర్మీవాహనాలపై ఉగ్రదాడి.. తమ పనేనని చెప్పుకున్న పాక్ ఉగ్ర సంస్థలు

జమ్ముకాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కాపు కాసి ఆర్మీ వాహనాలపై దాడి చేశారు. కాగా.. జమ్ముకాశ్మీర్ లో ఉగ్రవాదులను ఎరివేయాలని జవాన్లు కృష్టి చేస్తున్నారు. తాజాగా.. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి చేశారు. ఘటనలో ఐదుగురు సైనికులు మరణించగా.. ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3:45 గంటలకు ధేరా కీ గలీ, బుఫ్లియాజ్ మధ్య ధాత్యార్ మోర్ వద్ద ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు.

Also read: Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ కేసులో మరో 16 మంది అరెస్ట్.. వారిలో నలుగురు మైనర్లు

మూల మలుపు, ఎగుడుదిగుడుగా ఉన్న రహదారి కారణంగా ఈ సమయంలో ఆర్మీ వాహనాలు వేగాన్ని తగ్గించడంతో పూంచ్ జిల్లాలోని ధాత్యార్ మోర్హ్ ప్రదేశాన్ని ఉగ్రవాదులు దాడి చేయడానికి ఎంచుకున్నారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులు ధేరా కీ గలీ, బుఫ్లియాజ్ మధ్య ధాత్యార్ మోర్ వద్ద ఉన్న కొండపై నుంచి దాడికి పాల్పడి.. రెండు ఆర్మీ వాహనాలపై బుల్లెట్ల వర్షం కురిపించారని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

రెండు ఆర్మీ వాహనాలలో ఒక ట్రక్కు, ఒక మారుతి జిప్సీలపై మెరుపుదాడి చేశారు. దాడిలో ముగ్గురు లేదా నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి. భద్రతా బలగాలు కాల్పులు జరిపిలోపే.. ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LET)కి చెందిన పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (PAFF) ఈ దాడికి బాధ్యత వహించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button