TS Police: న్యూ ఇయర్ వేళ తాగి బండి నడిపారో.. ఇక అంతే!
రాష్ట్ర వాప్తంగా జరిగే న్యూఇయర్ సెలబ్రేషన్స్, ఈవెంట్స్పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్ట్లు నిర్వహించాలని నిర్ణయించారు. మద్యం తాగి పట్టుబడిన వారి వాహనాలను సీజ్ చేయడంతోపాటు ఆల్కహాల్ కంటెంట్ ను బట్టి కేసు నమోదు చేసి, రూ.10 వేలు, ఆరు నెలల జైలు శిక్ష పడేలా కొరడా ఝుళిపించనున్నారు. ర్యాష్ డ్రైవింగ్, పబ్లిక్ న్యూసెన్స్ చేసే వారిపై కేసులు నమోదు చేయనున్నారు. ఈ మేరకు అన్ని పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ ఆఫీసులను డీజీపీ కార్యాలయం అప్రమత్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్స్టేషన్స్ పరిధిలో చెక్పాయింట్స్, బ్రీత్ ఎనలైజర్ టెస్ట్లు తప్పనిసరి చేయాలని ఆదేశించింది.
Also read: VC Sajjanar: ఫ్రీ బస్సు జర్నీ ఎఫెక్ట్.. రాయితీ టికెట్లు కట్
న్యూ ఇయర్ ఈవెంట్స్కు అర్ధరాత్రి ఒంటి గంట వరకే అనుమతులు ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఎవరైనా కొనసాగిస్తే.. కేసులు నమోదు చేస్తారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 చెక్పాయింట్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ఎస్ఐ స్థాయి అధికారి ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నారు. డ్రగ్స్ తీసుకున్న వారిని గుర్తించేందుకు డ్రగ్ డిటెక్షన్స్ను టెస్ట్లు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు టీఎస్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీ న్యాబ్) ఇప్పటికే 120 డ్రగ్ డిటెక్షన్ పరికరాలను కొనుగోలు చేసింది.
డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వారి బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్(బీఏసీ)30 ఎమ్ఎల్ వచ్చినా వారిపై కేసులు నమోదు చేస్తారు. మద్యం మోతాదుకు అనుగుణంగా చార్జ్ షీట్స్ ఫైల్ చేస్తారు. కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులో రూ.10 వేల జరిమానా లేదా ఆ నెలల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు డ్రంకెన్ డ్రైవ్ డేటా ఆధారంగా డ్రైవింగ్ లైనెన్స్ను సస్పెండ్ చేస్తారు. డ్రగ్స్ తీసుకొని పట్టుబడిన వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. ఇలాంటి కేసుల్లో బెయిల్ దొరికే చాన్స్ తక్కువ ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.