Parliament: లోక్ సభలో కలకలం.. ఎంపీలపైకి దూకిన దుండగులు
శీతాకాల పార్లమెంట్ (Winter Parliament Session)లో కలకలం ఏర్పడింది. లోక్ సభ (Lok Sabha) సమావేశం కొనసాగుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు దూకారు. సందర్శకుల గ్యాలరీ (Visitors Gallery) నుంచి సభలోకి ఇద్దరు దూకడంతో గందరగోళం ఏర్పడింది. వెంటనే ఆ ఇద్దరిని భద్రతా సిబ్బంది (Security) అదుపులోకి తీసుకుంది. ఈ సంఘటనతో పార్లమెంట్ (Parliament)లో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. పార్లమెంట్ పై ఉగ్రదాడి జరిగిన నాడే ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
Also Read తవ్వుతున్న కొద్దీ అప్పులు.. బండెడు భారం మోపిన కేసీఆర్
ఎంపీలు కూర్చునే టేబుళ్ల పైకి ఎక్కి ‘నల్ల చట్టాలను రద్దు చేయాలి’ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. 22 ఏళ్ల కిందట కూడా ఇదే తీరున సంఘటన జరిగింది. మరోసారి అలాంటి సంఘటనే చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ పరిణామంతో లోక్ సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.