![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/374931-780x470.webp)
IND VS ENG: పీకల్లోతు కష్టాల్లో భారత్.. వరుసగా వికెట్లు!
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్సింగ్లో ఇంగ్లాండ్ 420 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 119 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం 52 ఓవర్లలో 141 పరుగులు చేయగా.. క్రీజులో రవిచంద్రన్ అశ్విన్, శ్రీకర్ భరత్ ఉన్నారు. ఇంకా భారత విజయానికి ఇంకా 90 పరుగులు కావాలి.
ALSO READ: ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ సంచలన విజయం..21 ఏళ్ల తర్వాత
వికెట్లు కోల్పోయిందిలా..
230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 42 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్ట్లీ ఓవర్లలో యశస్వి జైస్వాల్ (15), శుభ్మన్ గిల్ను (0) ఔటయ్యారు. ఆ తర్వాత టామ్ హార్ట్లీ బౌలింగ్లో కెప్టెన్ రోహిత్ శర్మ 39 పరుగుల వద్ద ఎల్బీడబ్యూగా వెనుదిరిగాడు. టీ విరామం తర్వాత భారత్ 95 పరుగుల వద్ద అక్షర్ పటేల్, 106 పరుగుల వద్ద కేఎల్ రాహుల్, 119 పరుగుల వద్ద జడేజా, 119 పరుగుల వద్ద శ్రేయస్ అయ్యర్ ఔట్ కావడంతో భారత్ ఏడు వికెట్లు కోల్పోయింది. క్రీజులో ప్రస్తుతం రవిచంద్రన్ అశ్విన్, శ్రీకర్ భరత్ ఉన్నారు.