తెలుగు
te తెలుగు en English
క్రికెట్

IND vs ENG: 33 ప‌రుగుల‌కే మూడు వికెట్లు.. రోహిత్ హాఫ్ సెంచరీ

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ చేపట్టిన భారత్.. 33 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ జైస్వాల్ 10 పరుగుల వద్ద ఔట్ కాగా.. క్రీజులోకి వచ్చిన గిల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ర‌జ‌త్ పాటిదార్(5) ఔట్ కావడంతో భారత్ మ‌రింత క‌ష్టాల్లో పడింది.

ALSO READ: ఐపీఎల్-2024 సర్వత్రా ఉత్కంఠ.. ధోనీ బ్యాట్ పై చర్చ

నాలుగో వికెట్‌కు 60 పరుగులు..

మూడో వికెట్లు పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా(24)తో కలిసి భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(52*) నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 60 పరుగులు జోడించారు. కాగా, ఇది రోహిత్ శర్మకు 17వ హాఫ్ సెంచరీ. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ రెండు వికెట్లు, టామ్ హ‌ర్ట్లే ఒక వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం భారత్ మూడు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button