AP Elections: వైసీపీలో చేరిన అంబటి రాయుడు.. అక్కడి నుంచే పోటీ?
భారత్ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ మేరకు అంబటి రాయుడును హత్తుకున్న జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం అంబటి రాయుడు మాట్లాడారు. రాజకీయాల్లో నా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాను. వైసీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్ పాలన పారదర్శకంగా ఉందని ప్రశంసలు కురిపించారు.
ALSO READ: ప్రజలకు సీఎం జగన్ ‘న్యూ ఇయర్ గిఫ్ట్’.. అర్హులందరికీ అందాలి
చంద్రబాబు, పవన్పై విమర్శలు
గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి అంబటి రాయుడు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే పార్టీలో చేరిన వెంటనే ఆయన టీడీపీ అధినేత, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై విరుచుకుపడ్డారు. సంక్షేమ పథకాలపై చంద్రబాబు, పవన్ పలుమార్లు విమర్శలు చేశారని, మళ్లీ వాళ్లే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ప్రజలకు అంతా తెలుసని, ఎవరికి మద్దతు ఇవ్వాలో వారికే ఇస్తారన్నారు. నా ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పార్టీలోకి వచ్చినట్లు తెలిపారు.