![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/విజయ్.jpg)
Vijay Deverakonda: విజయ్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్… ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. ‘వీడీ12’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ ప్రాజెక్ట్ రానుండగా విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక విజయ్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ షూటింగ్లో బిజీగా ఉండగా.. మార్చి నుంచి ‘వీడీ12’ సినిమా షూటింగ్ ప్రారంభంకానున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా మొదట శ్రీలీల పేరు వినిపించింది.
Also Read: రష్మిక డీప్ ఫేక్ వీడియో… వ్యక్తి అరెస్ట్
అయితే తాజా సమాచారం ప్రకారం శ్రీలీల స్థానంలో బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తుంది. ఈ విషయంపై త్రిప్తితో సంప్రదింపులు జరపగా.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ రుక్మిణీ వసంత్ కూడా ఈ సినిమాలో కథానాయికగా ఎంపిక అయినట్లు టాక్. కాగా దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ తెరకెక్కిస్తున్నది.
Also Read: ‘హనుమాన్’ సినిమా కలెక్షన్స్.. 8 రోజుల్లో ఎంతంటే?
‘యానిమల్’ బ్లాక్ బస్టర్ విజయంతో క్రేజీ హీరోయిన్గా మారిపోయిన త్రిప్తి డిమ్రి… ప్రస్తుతం బాలీవుడ్లో రెండు సినిమాలు చేస్తోంది. విక్కీ కౌషల్తో ‘మేరే మహబూబ్ మేరే సనం’ మూవీతో పాటు రాజ్కుమార్ రావుతో ‘విక్కీ విద్యా కా వో వాలీ వీడియో’ అనే మరో మూవీలో నటిస్తోంది. ‘సప్త సాగరాలు దాటి’ మూవీతో తెలుగువారికి తెగ నచ్చేసిన రుక్మిణి వసంత్, ప్రస్తుతం కోలీవుడ్లో రెండు సినిమాలు చేస్తోంది. శ్రీమురళి హీరోగా ‘భగీరా’ మూవీతో పాటు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్కుమార్తో ‘భైరతి రణగల్’ మూవీలోనూ ఓ కీ రోల్లో నటిస్తోంది రుక్మిణి వసంత్.