High Court: కోదండరాంకు షాకిచ్చిన హైకోర్టు… ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారానికి బ్రేక్
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొ.కోదండరామ్, అమీర్ అలీఖాన్ ల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రమాణ స్వీకారం చేయవద్దని ఆదేశించింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొ. కోదండరామ్, అమీర్ అలీఖాన్ లను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. అయితే ఈ నియామకం పై బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాము వేసిన పిటిషన్ విచారణ తేలేంత వరకు ఎమ్మెల్సీల నియామకాలను ఆపాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
Also Read: సీఎం రేవంత్ రెడ్డితో కేఏ పాల్ భేటీ… గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్కు ఆహ్వానం
ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఆదేశించింది. అంతకు ముందు ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నిమయించడంతో ప్రమాణ స్వీకారం చేసేందుకు కోడందరామ్, అమీర్ అలీఖాన్ లు సిద్ధం కాగా మండలి చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో ప్రమాణ స్వీకారంపై హైడ్రామా నడిచింది. ఇంతలో కోర్టు తాజా ఆదేశాలు జారీ చేయడంతో ఈ వ్యవహారం రాజకీయంగా మరో ట్విస్ట్ గా మారింది.
Also Read: తెలంగాణలో అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు: సీఎం రేవంత్
కొన్ని రోజుల ముందు ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఉదయాన్నే కౌన్సిల్ హాల్ కు చేరుకున్నారు. అయితే వారితో ప్రమాణం చేయించాల్సిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రం అక్కడకు రాలేదు. గంటలు గడిచినా మండలి చైర్మన్ ఆఫీస్ కి రాలేదు. ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం బీఆర్ఎస్ కి ఇష్టం లేదని, ఉద్దేశపూర్వకంగానే గుత్తా సుఖేందర్ రెడ్డి రాలేదని కాంగ్రెస్ నుంచి విమర్శలు మొదలయ్యాయి.