![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/03/186966-kaleshwaram-780x470.jpg)
Kaleshwaram: తెలంగాణకు రానున్న ఎన్డీఎస్ఏ బృందం.. జలసౌధలో భేటీ
కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయనం కోసం ఎన్డీఎస్ఏ బృందం ఇవాళ తెలంగాణకు రానుంది. ఈ మేరకు హైదరాబాద్లోని జలసౌధలో రాష్ట్ర ఇరిగేషన్ డిపార్టుమెంట్ ఆఫీసర్లు, ఇంజినీర్లతో కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన మొత్తం ఆరుగురు సభ్యులు భేటీ కానున్నారు. ఆ తర్వాత మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను గురు, శుక్రవారాల్లో సందర్శించనున్నారు.
ALSO READ: చిత్తశుద్ది ఉంటే ఈ పనులు చేయండి… ప్రభుత్వానికి హరీష్ రావు సూచన
నాలుగు నెలల్లో పూర్తి రిపోర్టు!
రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఏర్పాటైన ఆరుగురు నిపుణుల కమిటీ బృందం కాళేశ్వరంలో అధ్యయనం చేసిన అంశాలపై ఈ నెల 9న శనివారం హైదరాబాద్లో ఇరిగేషన్ ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. ఇందులో బ్యారెజీకి సంబంధించి ఎలాంటి చర్యలు, తీసుకునే జాగ్రత్తలపై సూచించనున్నట్లు సమాచారం. దీని తర్వాత 30 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక, నాలుగు నెలల్లో పూర్తి రిపోర్టును సమర్పించనున్నట్లు తెలుస్తోంది.
One Comment