Group 1: అభ్యర్థులకు అలెర్ట్.. ఎల్లుండే గ్రూప్-1 పరీక్ష
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను ఈ నెల 9వ తేదీన నిర్వహించనుంది. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లన్నిటినీ పూర్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహించగా.. పేపర్ లీక్, తప్పుడు ప్రశ్నల కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ప్రభుత్వం మారిన తర్వాత కమిషన్ ఛైర్మన్, సభ్యులను తొలిగించి ప్రక్షాళణ చేసి పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది.
ALSO READ: ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎన్డీయేను డిమాండ్ చేస్తారా?
ఎల్లుండి ఉదయం 10 గంటల 30 నిమిషాలకు గ్రూప్-1 ప్రిలిమ్స్ జరగనుంది. రాష్ట్రంలో 4 లక్షల 3 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. గతంతో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా టీజీపీఎస్సీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. హాల్ టికెట్పై రీసెంట్ ఫోటో అతికించుకొని ఎగ్జామ్ సెంటర్కు రావాలని బోర్డ్ సూచించింది. ఉదయం 9.30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి అయ్యాకే అభ్యర్థులను లోపలికి పంపనున్నట్లు స్పష్టంచేసింది.
ALSO READ: ఏపీ కొత్త సీఎస్గా నీరభ్ కుమార్ ప్రసాద్
ఫిబ్రవరి 19న 563 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
పోస్టులు: డిప్యూటీ కలెక్టర్లు- 45, డీఎస్పీ- 115, సీటీవో- 48, ప్రాంతీయ రవాణా అధికారి- 4, జిల్లా పంచాయతీ అధికారి- 7, జిల్లా రిజిస్ట్రార్- 6, జైళ్లశాఖలో డీఎస్పీ- 5, అసిస్టెంట్ లేబర్ కమిషనర్- 8, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్- 30, గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్లు- 41, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి- 3, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి- 5, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి-2, జిల్లా ఉపాధి అధికారి- 5, పరిపాలనాధికారి (వైద్యారోగ్యశాఖ)- 20, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్- 38, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్- 41, మండల పరిషత్ అభివృద్ధి అధికారి- 140.