Akkineni Nagarjuna: చంచల్ గూడ జైలుకు ప్రముఖ హీరో.. అందుకే వెళ్లారా?
టాలీవుడ్లో మరో మల్టీ స్టారర్ మూవీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్టార్ హీరోస్ నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ అప్డేట్ ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ మొదలైందని, ప్రస్తుతం నాగార్జునకు సంబంధించిన ప్రధాన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమా కోసమని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కినేని నాగార్జునతో హైదరాబాదులోని చంచల్ గూడ జైలులో తీస్తున్నారు.
ALSO READ: ఆసక్తికరంగా ‘లాపటా లేడీస్’ ట్రైలర్
పెరిగిన అంచనాలు..
ఈ సినిమా షూటింగ్ రెండు రోజుల నుంచి చంచల్ గూడ జైలులో అవుతోందని, ఇంకా ఒకటి రెండు రోజులు అక్కడే జరుగుతుందని సమాచారం. శేఖర్ కమ్ముల, ధనుష్, నాగార్జున కాంబోలో వస్తున్న ఈ సినిమాకి అంచనాలు పెరిగాయి. డీ51’గా వస్తున్న ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. కాగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున నటించడం ఇదే మొదటిసారి.