Bheema: గోపిచంద్ ‘భీమా’ మూవీ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్
గోపీచంద్ కథానాయకుడిగా ‘భీమా’ సినిమా రూపొందింది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి హర్ష దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే భీమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ఫస్ట్ సాంగ్ ఆకట్టుకున్నాయి. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి మార్చి 8న విడుదల చేయనున్నారు.
Also Read: ధన్యవాదాలు బాస్… ఫోన్ పే పేమెంట్లలో మహేశ్ బాబు వాయిస్
తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. ‘గల్లీ సౌండుల్లో నువ్వు బ్యాండు కొట్టు మామా, బాసు .. బిందాసు వచ్చాడు చూడు భీమా’ అంటూ ఈ పాట సాగుతోంది. ఈ మూవీకి కెజిఎఫ్ సినిమాల ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ దీనిని భారీగా నిర్మిస్తున్నారు. బీట్ పరంగా చూస్తే బాగానే అనిపిస్తుంది. కానీ సాహిత్యం పరంగా చూస్తే, బరువు తక్కువగా అనిపిస్తుంది. ప్రియా భవాని శంకర్ – మాళవిక శర్మ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, శివరాత్రి కానుకగా మార్చి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.