తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Devara: సముద్రాన్ని ఎరుపెక్కించిన ‘దేవర’..గ్లింప్స్ చూస్తే గూస్ బంప్స్

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వ‌స్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఆర్ఆర్ఆర్’ తర్వాత జూ.ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఎప్పుడు వస్తుందోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను మొదట ఒక పార్ట్ అనుకున్నారు. కానీ తర్వాత భాగాలుగా రానున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కాగా, ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

ALSO READ: ఉపేంద్ర ‘యుఐ’ మూవీ టీజర్ రిలీజ్

సరికొత్తగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ వీడియో అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇందులో ఎన్టీఆర్ చెప్పిన.. ‘ఈ సముద్రం చేపల కంటే కత్తులను, నెత్తురిని ఎక్కువ చూసుండాది అందుకే దీన్ని ఎర్రసముద్రం అంటారు’ అని చెప్పిన డైలాగ్ హైలెట్ అని చెప్పాలి. ఇందులో ఎన్టీఆర్ లుక్, ఎలివేషన్స్, అనిరుధ్ మార్క్ బీజీఎం అదిరిపోయింది. అదే విధంగా విజువల్స్‌కి ఇంగ్లీష్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరికొత్తగా అనిపించింది. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా చేస్తున్నాడు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ 5న దేవర పార్ట్-1 విడుద‌ల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button