![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/03/krish.jpeg)
Drug Case: హైకోర్టును ఆశ్రయించిన డైరెక్టర్ క్రిష్
తెలంగాణలో సంచలనం సృష్టించిన రాడిసన్ డ్రగ్స్ కేసు రోజు రోజుకు మలుపులు తిరుగుతోంది. ఈ డ్రగ్స్ కేసులో సినీ డైరెక్టర్ క్రిష్ కూడా ఉన్నట్లు పేర్కొని క్రిష్ ను విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో గచ్చిబౌలి పోలీసుల విచారణకు హాజరుకాకుండా ముందస్తు బెయిల్ కోసం డైరెక్టర్ క్రిష్ హైకోర్టును ఆశ్రయించారు. క్రిష్ తో పాటు ఈ కేసులో అనుమానితులుగా ఉన్న రఘు చరణ్ అట్లూరి, సందీప్ తోపాటు సినీనటి లిషి, శ్వేత, నీల్ తదితరులు కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
Also Read: లైఫ్ లాంగ్ మనిషిని ముట్టుకోకుండా ఉండగలవా?… ‘గామి’ ట్రైలర్!
డ్రగ్స్ కేసులో హైకోర్టులో క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే క్రిష్ తాను ముంబైలో ఉన్న కారణంగా పోలీసుల విచారణకు రాలేనని, తనకు మరో రెండు రోజుల సమయం కావాలని కోరారు. కానీ నేడు క్రిష్ వ్యక్తిగతంగా పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని పోలీసులు తెలిపారు. దీంతో క్రిష్ హాజరుపై సస్పెన్స్ కొనసాగుతుంది.
Also Read: శ్రీలీల షాకింగ్ డెసిషన్.. నిరాశలో పడిపోయిన ఫ్యాన్స్
గచ్చిబౌలిలోని రాడిషన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో డ్రగ్ సప్లయర్ అబ్బాస్ తో సహా మరో పది మందిపై కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్ పార్టీ వ్యవహారం సినీ ఇండస్ట్రీలో మరోసారి కలకలం రేపింది. అయితే ఈ కేసులో అబ్బాస్ ను నార్కోటిక్ పోలీసులు విచారణ చేయగా టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్ల మూడి పేరును బయటపెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాడిసన్ డ్రగ్స్ పార్టీలో మూవీ డైరెక్టర్ క్రిష్ ఉన్నట్లు అనుమానించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
One Comment