తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Drugs Party: డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం.. తెరపైకి డైరెక్టర్ క్రిష్ పేరు!

రాడిసన్ డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ క్రిష్ పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో 8వ నిందితుడిగా గచ్చిబౌలి పోలీసులు ఆయన పేరును చేర్చారు. పార్టీ జరిగే సమయంలో బీజేపీ నేత కుమారుడు వివేకానందతోపాటు డైరెక్టర్‌ క్రిష్‌ ఉన్నట్లు తెలిపారు. అంతకుముందు గజ్జెల వివేక్‌ నిర్వహించిన పలు పార్టీలకు సైతం క్రిష్‌ హాజరైనట్లు సమాచారం.

ALSO READ: టీవీలోనూ ‘మంగళవారం’ మూవీ బంపర్ హిట్..8.3 టీఆర్పీ రేటింగ్

స్నేహితుడు పిలిస్తే పార్టీకి వెళ్లా..

డ్రగ్స్ కేసు విషయంలో పోలీసులు క్రిష్ స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ఓ స్నేహితుడు పిలిస్తే పార్టీకి వెళ్లానని, డ్రైవర్ రాగానే అక్కడి నుంచి వెళ్లిపోయానని ఆయన తెలిపారు. కాగా, గచ్చిబౌలిలోని ర్యాడిసన్‌ బ్లూ హోటల్‌లో కొకైన్‌తో డ్రగ్‌ పార్టీ జరుగుతున్నట్లు సమాచారంతో పోలీసులు హోటల్‌పై దాడిచేసిన సంగతి తెలిసిందే. అయితే వీళ్లు వెళ్లే సమయానికి అందరూ పరారయ్యారు. ఆ తర్వాత పార్టీ నిర్వహించిన మంజీర గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ డైరెక్టర్‌ గజ్జల వివేకానంద ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. వెంటనే ఆయనకు పరీక్షలు నిర్వహించగా.. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button