తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Guntur Kaaram: ఓటీటీలోకి ‘గుంటూరు కారం’..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజు నుంచి ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ రావడంతోపాటు ఇప్ప‌టివ‌ర‌కు ఏకంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరీలు హీరోయిన్స్‌గా నటించారు. తాజాగా, ఈ మూవీ ఓటీటీలోకి వస్తుంది. ఈ మేరకు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది.

ALSO READ: పుష్ప2 నుంచి కీలక అప్డేట్.. 40 రోజులు.. 12 నిమిషాల గంగమ్మ తల్లి జాతర

నెట్‌ఫ్లిక్స్‌లో చూడండి..

ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్‌కి సిద్ధం చేస్తున్నట్లుగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఓ పోస్టర్ విడుదల చేసింది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ తెలుపుతూ.. ‘రౌడీ రమణని 70 ఎంఎంలో చూశారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో చూడడానికి సిద్ధమవ్వండి.’ అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. కాగా, ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button