Diwali.. చెర్రీ నివాసంలో దీపావళి.. తరలివచ్చిన తారలు
దీపావళి పండుగను సినీ ప్రముఖులు ఘనంగా చేసుకుంటున్నారు. పండుగ సందర్భంగా అగ్ర నటుడు రామ్ చరణ్ (Ram Charan) తోటి నటీనటులకు విందు ఇచ్చారు. హైదరాబాద్ (Hyderabad)లోని వారి నివాసంలో రాత్రి రామ్ చరణ్- ఉపాసన (Upasana) దంపతులు పార్టీ ఇవ్వగా.. ఈ వేడుకకు మహేశ్ బాబు-నమ్రత శిరోద్కర్, ఎన్టీఆర్-ప్రణతి దంపతులు హాజరయ్యారు. తండ్రి చిరంజీవి కుటుంబసభ్యులు కూడా హాజరైనట్లు తెలుసతోంది. దగ్గుబాటి వెంకటేశ్ (Daggubati Venkatesh)తో పాటు మరికొందరు నటీనటులు, దర్శక నిర్మాతలు దీపావళి విందులో పాల్గొన్నారు. భోజనంతో పాటు ఆటలు ఆడుకుని సరదాగా గడిపారు. అనంతరం బాణసంచా, టపాసులు కాల్చి సందడి చేశారు.
చదవండి: Lepcha.. సరిహద్దులో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
పాప క్లీంకార పుట్టాక తొలి దీపావళి కావడంతో చెర్రీ దంపతులు ఈ విందు ఇచ్చినట్లు సమాచారం. ఈ విందుకు సంబంధించిన ఫొటోలను మహేశ్ (Mahesh Babu) సతీమణి నమ్రత ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. తరచూ ఇలాంటి విందులు ఇస్తూ సినీ పరిశ్రమలో అందరితో కలివిడిగా ఉంటారు. ఇక సినిమాల పరంగా చూస్తే శంకర్ దర్శకత్వంలో చెర్రీ ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమా లైన్ లో పెట్టాడు.
చదవండి: దీపావళి శుభాకాంక్షలు.. పండుగ విశిష్టతలు తెలుసా మీకు?