![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/ఎన్టీఆర్-780x470.jpg)
Japan: జపాన్ లో భూకంపం… దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎన్టీఆర్
షూటింగ్కు విరామం లభించడంతో క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలను ఫ్యామిలీతో కలిసి జరుపుకునేందుకు జపాన్కు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ తీవ్ర భూకంపం సంభవించడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
Also Read: త్వరలో జర్నీ మూవీ రీ రిలీజ్.. ఎప్పుడంటే?
జపాన్ నుంచి ఈరోజు ఇంటికి తిరిగొచ్చామని… తీవ్ర భూప్రకంపాలు సంభవించడం షాక్కు గురిచేసిందని తెలిపారు. గత వారం అంతా అక్కడే గడిపామని… భూకంప ప్రభావితమైన వారందరికీ తన సానుభూతి తెలియజేశారు. జపాన్ ప్రజలు ఈ ప్రమాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఆశిస్తు… దృఢంగా ఉండు జపాన్ అంటూ ఆయన ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.కాగా భార్య లక్ష్మీ ప్రణతి, ఇద్దరు కొడుకులు అభయ్, భార్గవ్లతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ జపాన్ వెళ్లారు.
Also Read: పెళ్లి పీటలెక్కబోతున్న రకుల్ ప్రీతి సింగ్.. వరుడు ఎవరంటే?
వరుస భూకంపాలు జపాన్ ను కుదిపేశాయి. ఒక్క రోజులోనే ఏకంగా 155 సార్లు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై అత్యధికంగా 7.6 గా నమోదైంది. దీంతో రోడ్లు ధ్వంసం కాగా చాలా ఇళ్లు, పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకుని ఇప్పటి వరకు 24 మంది చనిపోయారని జపాన్ ప్రభుత్వం వెల్లడించింది. కూలిన నిర్మాణాల కింద మరికొంతమంది చిక్కుకుని ఉంటారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రధాని ఫ్యూమియో కిషిడా ఆందోళన వ్యక్తం చేశారు.