సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథాంశంతో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రిలీజైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్లో వేగం పెంచింది. అందులో భాగంగా ఓ ఇంగ్లిష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ ఆసక్తికర వాఖ్యాలు చేశారు.
ALSO READ: మూవీ రివ్యూ: హరోం హర
‘ఈ చిత్రంలో ఎంతో మంది స్టార్స్ నటించారు. వాళ్లను డైరెక్ట్ చేయడం సామాన్యమైన విషయం కాదు. నేను డైరెక్షన్లోకి వచ్చి తక్కువ కాలమే అవుతుంది. అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ వంటి వారు నాలుగు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. గొప్ప నటులు. వారికి సీన్స్ వివరించడం సిల్లీగా అనిపించింది. ఈ సినిమా కోసం తొలి సన్నివేశాన్ని అమితాబ్తో తీశాను. ఆయనకు ఇందులో మంచి యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అమితాబ్, కమల్ హాసన్ ఎంత ఎత్తుకు ఎదిగినా నేర్చుకుంటూనే ఉంటారు. అది వాళ్ల గొప్పతనం. ప్రభాస్, దీపికాలకు ఉన్న స్టార్డమ్ను దృష్టిలో పెట్టుకొని.. ఫ్యాన్స్ వాళ్ల నుంచి ఏం కోరుకుంటున్నారో అలానే చూపించాను.’ అని అన్నారు.