Mahesh Babu: గుంటూరు కారం… ఓ మై బేబి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం చిత్రం నుంచి రెండో పాట రిలీజ్ అయింది. ‘ఓ మై బేబీ’ అనే ఈ పూర్తి లిరికల్ సాంగ్ నేడు వచ్చేసింది. హీరో మహేశ్, హీరోయిన్ శ్రీలీల మధ్య డ్యుయెట్గా ఈ సాంగ్ ఉంది. తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది.
Also Read: పూజ హెగ్డేకి బెదిరింపులు.. చంపుతామని హెచ్చరిక
ఇప్పటికే విడుదల చేసిన దమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్ అభిమానులకు విజువల్ ఫీస్ట్ ఫీల్ అందించేలా సాగుతూ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తోంది. తాజాగా సెకండ్ సింగిల్ ఓ మై బేబి లిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను శిల్పారావు పాడింది. గుంటూరు కారంలో మీనాక్షి చౌదరి సెకండ్ ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించనుంది. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంగీతం అందిస్తున్నాడు.