Mansoor Ali Khan: చిరంజీవితోపాటు మరో ఇద్దరిపై రూ.కోటి పరువునష్టం దావా
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష నటించిన తాజా చిత్రం ‘లియో’. ఈ చిత్రంలో నటించిన తమిళ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో త్రిషపై కామెంట్స్ చేయడంతో సినీ పరిశ్రమలో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కాగా, ఈ అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పలువురు సినీ స్టార్స్ త్రిషకు మద్దతు తెలిపారు. దీంట్లో భాగంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, నటి ఖుష్బూ తీవ్రంగా ఖండించారు. తర్వాత త్రిష కూడ ఈ వ్యాఖ్యలపై కౌంటర్ వేయగా మొదట క్షమాపణలు చెప్పేదే లేదన్న మన్సూర్ వెనక్కి తగ్గారు. అంతా అయిపోయింది అనుకుంటున్న సమయంలో మరోసారి ఈ గొడవ కొత్త రూపం సంతరించుకుంది.
ALSO READ: కలశ ట్రైలర్ రిలీజ్.. బాగుందన్న డైరెక్టర్ గోపిచంద్
డిసెంబర్ 11న విచారణ..
మన్సూర్ ఆలీ ఖాన్ ఈ విషయంపై పరువునష్టం కింద నోటీసులు పంపిస్తున్నానంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా త్రిషకు, ఖుష్బూ, చిరంజీవిలపై శుక్రవారం మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఇందులో కోటి నష్టపరిహారంతోపాటు వీడియో మొత్తం చూడకుండా తన పరువుకు భంగం కలిగించారని మన్సూర్ అలీఖాన్ పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం. కాగా, ఈ కేసుపై డిసెంబర్ 11న విచారణ జరగనుంది.