తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Prashant: బిగ్ బాస్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్… శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు

మూడు నెలలకు పైగా తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉర్రూతలూగించిన బిగ్ బాస్ సీజన్-7 టైటిల్ ను ‘రైతు బిడ్డ’ పల్లవి ప్రశాంత్ కైవసం చేసుకున్నాడు. ఎంతో ఉత్సాహభరితంగా సాగిన గ్రాండ్ ఫినాలే చివర్లో బిగ్ బాస్ ఇంట్లో మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్లు పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ చౌదరిలను హోస్ట్ నాగార్జున స్టేజిపైకి తీసుకువచ్చారు. అనంతరం… పల్లవి ప్రశాంత్ విజేత అంటూ అనౌన్స్ చేశారు. అమర్ దీప్ చౌదరిని రన్నరప్ గా ప్రకటించారు.

Also Read: భయపెడుతున్న ‘డెమోంటే కాలనీ 2’ ట్రైలర్

బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ హోదాలో పల్లవి ప్రశాంత్ కు 35 లక్షల ప్రైజ్ మనీ అందించారు. దాంతో పాటే మారుతి సుజుకి బ్రెజా కారు, జోయాలుక్కాస్ నుంచి 15 లక్షల గిఫ్ట్ వోచర్ కూడా లభించాయి. తాను ముందు చెప్పినట్టుగా తాను గెలిచిన ప్రైజ్ మనీలో ప్రతి పైసా కష్టాల్లో ఉన్న రైతులకు ఇస్తానని వేదిక పైనుంచి ప్రకటించాడు. ఇక కారును తన తండ్రికి ఇస్తానని, తల్లికి నెక్లెస్ ఇస్తానని తెలిపాడు.

Also Read: నా సామి రంగ టీజర్… యాక్షన్ మూడ్ లో నాగార్జున

బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సిద్ధిపేటకు చెందిన రైతుబిడ్డ బిగ్ బాస్ విజేతగా నిలువడం చాలా గర్వంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. పొలం నుంచి బిగ్ బాస్ హౌస్ వరకు అతని ప్రయాణం ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిందని హరీష్ రావు అన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button