Nagarjuna: నా సామి రంగ టీజర్… యాక్షన్ మూడ్ లో నాగార్జున
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, ఆషికా రంగనాథ్ జంటగా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘నా సామి రంగ’. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్తో పాటు ఫస్ట్ సింగిల్, అల్లరి నరేష్ ఇంట్రోను చిత్రబృందం విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Also Read: ఓటిటిలోకి వచ్చేస్తున్న ఆదికేశవ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ చేశారు. కథ మొత్తం పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈ టీజర్ లో నాగార్జున, ఆషికా రంగనాథ్, అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ పాత్రల గురించే చూపించారు. ”ఏమి చేస్తున్నాడేంటి మీవోడు. నిన్ననే మామిడితోటలో ఇరవైమందిని ఉతకొట్టుడు కొట్టేసాడు” అంటూ ఆషికా రంగనాథ్, నరేష్ సంభాషణలతో టీజర్ మొదలవుతుంది. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లా సాగిన ఈ టీజర్ ప్రస్తుతం ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది.
Also Read: రవితేజ కొత్త మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. టైటిల్ ఏంటో తెలుసా?
‘నా సామి రంగ’ చిత్రంలో మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ కూడా నటించారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ‘నా సామిరంగ’ వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.