Rana Naidu: రానా నాయుడు సరికొత్త రికార్డ్.. ఇండియా నుంచి ఏకైక వెబ్ సిరీస్
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన మొదటి వెబ్ సిరీస్ రానా నాయుడు. తండ్రీ కొడుకుల కాన్సెప్ట్ తో వచ్చిన ఈ బోల్డ్ వెబ్ సిరీస్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది. కాకపోతే.. వెంకటేష్ పై మాత్రం తీవ్ర విమర్శలు వచ్చాయి. కారణం ఈ సిరీస్ లో వెంకటేష్ బోల్డ్ సీన్స్ అండ్ డైలాగ్స్ చెప్పడం. నిజానికి వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకు భిన్నంగా అలా బోల్డ్ సిరీస్ లో కనిపించడం ఆయన ఫ్యాన్స్ తీసుకోలేకపోయారు.
Also read: Pooja Hegde: పూజ హెగ్డీకి బెదిరింపులు.. చంపుతామని హెచ్చరిక
అయితే మన ప్రేక్షకులకు పెద్దగా ఎక్కకపోయినా.. వరల్డ్ వైడ్ ఆడియన్స్ ను మాత్రం సూపర్ గా ఆకట్టుకుంది. ఎవరు బీట్ చేయలేని రికార్డ్ క్రియేట్ చేసింది రానా నాయుడు వెబ్ సిరీస్. నెట్ ఫ్లిక్స్ సంస్థ 6 నెలాలుగా ఎక్కువ వ్యూస్ సాధించిన సుమారు 18 వేల టైటిల్స్ డేటాను పరిశీలించింది.
అందులో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వ్యూస్ సాధించిన టాప్ 400 వెబ్ సిరీస్ ల్లో రానా నాయుడు వెబ్ సిరీస్ 336 వ చోటును దక్కించుకుంది. అంతేకాదు.. ఈ లిస్టులో ఇండియా నుండి చోటు దక్కించుకున్న ఏకైక వెబ్ సిరీస్ గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సిరీస్ కు 46 మిలియన్ల వీక్షణలు వచ్చినట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ తెలిపింది. యాక్షన్ అండ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్లో.. వెంకటేష్, రానా తండ్రీ కొడుకులుగా నటించారు. ఇక త్వరలోనే ఈ సిరీస్ కు సీక్వెల్ కూడా రానుందట. దానిపై త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన కూడా చేయనున్నారు.