తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Rashmika Mandanna: నేషనల్‌ క్రష్‌ డీప్‌ఫేక్‌ వీడియోపై మెటాకు పోలీసుల లేఖ

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా సంబంధించిన ఓ డీప్‌ఫేక్‌ వీడియో వైరల్ అయిన విష‌యం తెలిసిందే. జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. ఈ ఘటనపై అభిమానులే కాదు పలువురు సినీ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియోకు సంబంధించి ఢిల్లీ మహిళా కమిషన్‌ కూడా స్పందించింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు నోటీసు పంపింది. ఈ మార్ఫింగ్‌ వీడియోపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వీడియో ఏ అకౌంట్‌ నుంచి తొలుత అప్‌లోడ్‌ అయ్యిందనే వివరాలను ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటాను కోరారు. ఇందులో భాగంగానే మెటా సంస్థకు ఢిల్లీ పోలీసులు లేఖ రాసినట్లు తెలుస్తోంది.

రష్మికకు మద్దతు

బాలీవుడ్ హారో అమితాబ్ బచ్చన్ మొదలుకుని, విజ‌య్ దేవరకొండ, నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్, మృణాల్ ఠాకూర్, కీర్తి సురేశ్‌ ఇలా టాలీవుడ్ ప్రముఖులు అందరూ రష్మికకు మద్దతుగా నిలిచారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొందరు వ్యక్తులు రష్మిక మందన్నకు చెందిన ఓ డీప్ ఫేక్ వీడియోను రూపొందించారు. దీనిపై వెంటనే యాక్షన్‌ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button