తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Suhas: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన సుహాస్ ‘శ్రీరంగ నీతులు’

సుహాస్‌, కార్తీక్‌రత్నం, రుహానీశర్మ, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శ్రీరంగ నీతులు’. ఈ చిత్రానికి ప్రవీణ్‌ కుమార్‌ వీఎస్‌ఎస్‌ దర్శకత్వం వహించారు. ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సడెన్‌గా ఓటీటీలో ప్రత్యక్షమైంది. మే 30వ తేదీన భవానీ హెచ్‌డీ మూవీస్‌ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా అందుబాటులోకి రానున్నట్లు సదరు ఛానల్‌ అధికారికంగా ప్రకటించడంతో ఓటీటీ డీల్‌ జరగలేదేమో అనుకున్నారు. కానీ ఇవాళ్టి నుంచి ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్‌ మొదలైంది.

ALSO READ: జూన్ నుంచి టాలీవుడ్‌లో హంగామా షురూ!

ఈ మధ్య కాలంలో సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజి బ్యాండ్, ప్రసన్న వదనం సినిమాలు అందరికీ తెలుసు. ఈ రెండు సినిమాలు కూడా థియేటర్‌లో రిలీజ్ అయ్యి.. డీసెంట్ టాక్‌ను సంపాదించుకున్నాయి. కలెక్షన్స్ పరంగా ఎలా ఉన్నా కానీ.. కథ పరంగా మాత్రం ప్రేక్షకులను బాగానే మెప్పించాయి. అయితే ఈ రెండు సినిమాలకు మధ్యలో సుహాస్ నటించిన మరో సినిమానే శ్రీరంగ నీతులు. ఏప్రిల్ 11న ఈ సినిమా థియేటర్‌లో రిలీజై ఘోరంగా విఫలం అవ్వడం వలనే ఓటీటీ డీల్ సరిగా జరగలేదని వార్తలొచ్చిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button