Yatra 2: దేవుడు నమ్మకం, వైఎస్ఆర్ నిజం… ‘యాత్ర 2’ నుంచి సాంగ్ రిలీజ్
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి నిజ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా వస్తున్న చిత్రం యాత్ర 2. 2019లో వచ్చిన యాత్ర సినిమాకు సీక్వెల్గా ఈ చిత్రం రానుంది. మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో వైఎస్. రాజశేఖర్రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తుండగా.. సీఎం జగన్ పాత్రను కోలీవుడ్ యాక్టర్ జీవా పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్తో పాటు, టీజర్ను విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి ‘చూడు నాన్న’ లిరికల్ వీడియో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు.
Also Read: క్షమాపణలు చెప్పిన నయనతార… అలా అవుతుందని అనుకోలేదని వివరణ
జగన్ చేపట్టిన ఓదార్పుయాత్ర నేపథ్యంలో ఈ పాట ఉండగా ఫుల్ ఎమోషనల్గా ఈ సాంగ్ సాగింది. ఈ పాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాత్రలో జీవా తనదైన నటనతో మెప్పించారు. భాస్కరభట్ల ఈ పాటకు సాహిత్యం అందించగా.. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని సమకుర్చాడు. వైఎస్. రాజశేఖర్రెడ్డి మరణాంతరం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టడం, జగన్ జైలుకు వెళ్లడం ఇలా ప్రతిది 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయాల చుట్టూ ఈ సినిమా సాగనుంది.
Also Read: వరుణ్ తేజ్ బర్త్ డే స్పెషల్..ఫస్ట్ లుక్ రిలీజ్
తండ్రి మరణంతో మొదటిసారి ప్రజల్లో అడుగుపెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకే వేలాదిగా జనాలు వచ్చారు. ఆ సమయంలో జరిగిన కొన్ని ఘటనలను డైరెక్టర్ పాటలో చూపించారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 08న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.