తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh: ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్…పూర్తి వివరాలు మీకోసం

ఏపీ నిరుద్యోగులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ నెల 12 నుంచి డీఎస్సీ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు నివేదికలో తెలిపారు. మొత్తం 6,100 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. ఇందులో 2,299 స్కూల్ అసిస్టెంట్, 2,280 SGT పోస్టులు , 1,264 టీజీటీ, 215 పీజీటీ, 42 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. మార్చి 05 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మార్చి 15 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు జరుగనున్నాయి.

Also Read: విభజన హామీలు… ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు: వైఎస్ షర్మిల

మార్చి 31న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ఏప్రిల్ 02న ఫైనల్ కీ విడుదల చేసిన తరువాత. ఏప్రిల్ 05 పరీక్షల ఫలితాలను వెల్లడించనున్నట్టు మంత్రి బొత్స సత్యానారాయణ తెలిపారు. తమ ప్రభుత్వంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ఈ సందర్బంగా తెలిపారు. అభ్యర్థులు పూర్తి వివరాలను https://cse.ap.gov.in/loginhome లో తెలుసుకోవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button