![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/tdp-js-seat-sharing-finalised_b_1709230612-780x470.jpg)
AP Elections: జనసేనకు 17 సీట్లేనా..? కావాలనే లీక్స్ వదులుతున్న బాబు!
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల కోసం చేతులు కలిపారు. ఈ నేపథ్యంలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. కాగా, రానున్న ఎన్నికల్లో జనసేనకు కేటాయించే సీట్ల వ్యవహారంపై ఆ పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ALSO READ: మరో సంచలన సర్వే.. గెలిచేది ఆ పార్టీనే?
సుదీర్ఘ చర్చలు
టీడీపీ అధినేత చంద్రబాబు తన నివాసంలో ఇటీవల జనసేన అధినేతతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఇందులో భాగంగా సీట్ల వ్యవహారంపై చర్చించగా.. భిన్నమైన వార్తలు వినిపించినట్లు సమాచారం. సీట్ల కేటాయింపుపై జనసేన శ్రేణులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తొలి విడతలో సమస్యలేని నియోజకవర్గాల అభ్యర్థులను మాత్రమే ప్రకటించనున్నారు. ఈ జాబితాలో 15 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లు ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ALSO READ: ‘కోడి కత్తి’ శ్రీను సంచలన నిర్ణయం.. జైల్లో నిరాహారదీక్ష
మరో ఎంపీ టికెట్పై కసరత్తు
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాల్లో 15 స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలను జనసేనకు కేటాయించగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో చంద్రబాబు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇందులో మచిలీపట్నం ఎంపీ టికెట్ ఖరారు కాగా, మరో ఎంపీ టికెట్పై కసరత్తు చేస్తున్నారు. దీంతోపాటు పిఠాపురం, విజయవాడ వెస్ట్, చీరాల, దర్శి, శ్రీకాకుళం, కాకినాడ సిటీ, రూరల్, తిరుపతి, మాడుగుల, పోలవరం, పెడన, నంద్యాల, అనంతపురం రూరల్, ధర్మవరం, కల్యాణ దుర్గం, పూతలకట్టు వంటి అసెంబ్లీ నియోజకవర్గాలను జనసేనకు కేటాయించేందుకు చంద్రబాబు దాదాపు అంగీకారం తెలిపినట్లు సమాచారం.