తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Governement: ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోలేదు.. అసత్య ప్రచారాలు నమ్మొద్దు

ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం సేవలను యథావిధిగా ప్రజలకు అందిస్తామని.. సేవలు నిలిపివేస్తున్నట్లు జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఏపీ ఆరోగ్యశ్రీ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల సోషల్ మీడియా వేదికగా సేవలు నిలిపివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారానికి తమకు ఏ సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,150 ప్రైవేట్‌ ఆస్పత్రులు తమ అసోసియేషన్‌ పరిధిలో ఉన్నాయని, వీటిలో అన్ని సేవలు నిరంతరాయంగా అందుతాయని చెప్పారు.

ALSO READ: పాదచారుల కష్టాలకు చెక్… త్వరలోనే మెహదీపట్నంలో స్కై వాక్

ఎందుకీ ప్రచారం.. అసలు ఏమైంది?

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం వైద్య సేవలను గురువారం నుంచి యాజమాన్యాలు నిలిపివేయనున్నట్లు ప్రచారం జరిగింది. బకాయిల చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు మాత్రం బకాయిలను చెల్లించడకపోవడంతోనే సేవలు నిలిపివేసినట్లు నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రకటించినట్లు ప్రచారం నడుస్తోంది. బకాయిలతో పాటుగా ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ గత నెల 25నుంచే సేవలు నిలిపేస్తామని గతంలో ఆసుపత్రుల యాజమాన్యాల సంఘం ప్రకటించింది. అప్పట్లో దీనిపై యాజమాన్యాలతో చర్చించింది. ఆ తర్వాత ఆస్పత్రులు సేవలను కొనసాగించిన సంగతి తెలిసిందే.

ALSO READ: టీడీపీ, జనసేన విభేదాలు తారాస్థాయికి.. కారణం ఇదేనా!

ప్రచారం నమ్మొద్దు..

సీఎం జగన్‌ ప్రభుత్వం పథకానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని అధికారులు చెబుతున్నారు. ప్రొసీజర్‌లను భారీగా పెంచడమే కాకుండా, రోగులకు మెరుగైన సేవలు అందించడానికి ఏ మాత్రం రాజీ లేకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button