![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/CM-YS-Jagan-Credit-Third-Installment.jpg)
AP Government: పగటిపూట 9గంటల ఉచిత విద్యుత్.. రైతు బాగు కోసమే!
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, వరుసగా ఐదోసారి రైతు భరోసా నిధులు విడుదల చేసినట్లు సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి నిధులు జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే అన్నారు. దీంతో పాటు వరుసగా ఐదో ఏడాది మూడో విడతగా కింద వైఎస్సార్ రైతు భరోసా నిధులు జమ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఒక్కొక్కరికి రూ. 2,000 చొప్పున 53.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1,078.36 కోట్లు జమ చేశారు.
ALSO READ: పిఠాపురానికి మకాం మార్చిన పవన్..!
సున్నా వడ్డీ పంట రుణాలు..
రుణాలు తీసుకుని క్రమం తప్పకుండా కట్టే రైతులకు మేలు చేస్తున్నామని జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు నాలుగో ఏడాది వైఎస్సార్ సున్నా వడ్డీ పంటరుణాలు విడుదల చేశామని తెలిపారు. రబీ 2021-22, ఖరీఫ్ 2022 లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 10,78,615 మంది రైతులకు రూ.215.98 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును కూడా వారి ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 84.66 లక్షల మంది రైతులకు అందించిన వడ్డీ రాయితీ 2,050 కోట్లు అని తెలిపారు.
ALSO READ: జర్మనీ గాయని భక్తి పాట… దరువేసిన ప్రధాని మోదీ… వీడియో వైరల్
రైతులకు తోడుగా..
ప్రతీ అడుగులోనూ రైతులకు తోడుగా నిలుస్తున్నామని జగన్ చెప్పారు. ప్రతీ పథకం దాదాపుగా పేద రైతు కుటుంబానికి అందుబాటులో ఉంచామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఏడాదికి రూ.12,500 బదులు మరో రూ.1000 పెంచి రూ.13,500 ఇస్తున్నామన్నారు. దీంతో 50వేల స్థానంలో ఐదేళ్లలో రూ.67,500 రైతుల ఖాతాల్లో పడతాయన్నారు. రైతు కష్టం తెలిసిన ప్రభుత్వంగా చెప్పినదానికంటే ఎక్కువగా ఇచ్చిన ప్రభుత్వం మనది అని పేర్కొన్నారు. అలాగే 19 లక్షల మంది రైతులకు 9 గంటలపాటు నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని, దీంతో ప్రతి రైతుకు రూ.45వేల మేర మేలు జరుగుతుందన్నారు.