తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Government: చంద్రబాబు కూల్చిన ఆలయాలకు పునర్జీవం

కృష్ణా పురష్కరాల పేరిట 2016లో టీడీపీ హయాంలో నాటి సీఎం చంద్రబాబు విజయవాడలో నిర్దాక్షిణ్యంగా పెద్ద ఎత్తున కూలగొట్టిన తొమ్మిది ఆలయాలను కూల్చి వేశారు. అయితే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చిన ఈ తొమ్మిది ఆలయాలను పున:నిర్మాణం చేస్తామని ఇచ్చిన హామీ మేరకు నెరవేర్చింది. ఈ మేరకు రెండేళ్ల క్రితం ఆలయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయగా.. తాజాగా ఈ ఆలయాలను సీఎం జగన్ ప్రారంభించారు.

ALSO READ: జనసేనపై మంత్రి అమర్నాథ్ సెటైర్లు.. పొలిటికల్ కాంట్రాక్టు కోసమేనంటూ ఎద్దేవా

రూ.3.87 కోట్లతో అభివృద్ధి పనులు

గతంలో చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసిన ఆలయాలకు సీఎం జగన్ రూ.3.87 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ మేరకు రూ.31.5 లక్షలతో దక్షిణాముఖ ఆంజనేయస్వామి ఆలయం, రూ.9.5 లక్షలతో సీతమ్మవారి పాదాలు, రూ.10 లక్షలతో శ్రీసీతారామ లక్ష్మణ సమేత దాసాంజనేయస్వామి ఆలయం, రూ.10 లక్షలతో వీరబాబు ఆలయం, రూ.20 లక్షలతో విజయవాడ గో సంరక్షణ సంఘం కృష్ణ మందిరం, రూ.8 లక్షలతో బొడ్డు బొమ్మ, రూ.20 లక్షలతో ఆంజనేయస్వామి ఆలయం వినాయకస్వామి ఆలయం తొలి మెట్టు, రూ.2 కోట్లతో శ్రీశనైశ్వర స్వామి వారి ఆలయాలను పునర్నిర్మాణం చేశారు. వీటితోపాటు రూ.5.60 లక్షల ప్రభుత్వ నిధులతో చేపట్టిన మల్లేశ్వర స్వామి ఆలయం, రూ.4.25 కోట్లతో ఇంద్రకీలాద్రి కొండ రక్షణ పనులు, రూ.3.25 కోట్లతో చేపట్టిన ఎల్ టీ ప్యానల్ బోర్డులు, ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్, స్కాడా పనులు పూర్తి కావడంతో వాటిని సీఎం జగన్ ప్రారంభించారు. అలాగే పాతపాడులోని ఆలయానికి చెందిన స్థలంలో రూ.5.66 కోట్లతో ఓ మెగావాట్ సోలార్ విద్యుత్ కేంద్రం, కొండ దిగువన రూ.23 లక్షలతో ఆలయాలను నిర్మించారు.

ALSO READ: కేసీఆర్ త్వరగా కోలుకోవాలి: ప్రధాని మోదీ ప్రార్థన

రూ.216 కోట్లతో మాస్టర్ ప్లాన్

విజయవాడ దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న సీఎం జగన్.. ఇంద్రకీలాద్రిపై రూ.216 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతుల కల్పనలో భాగంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రూ.57 కోట్ల రాష్ట్ర నిధుల్లో రూ.30 కోట్లతో అన్న ప్రసాద భవన నిర్మాణం, రూ.27 కోట్లతో ప్రసాదం పోటు భవన నిర్మాణం, రూ.13 కోట్లతో ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, రూ.15 కోట్లతో రాజగోపురం ముందు భాగం వద్ద మెట్ల నిర్మాణం, రూ.23.50 కోట్లతో దక్షిణాన అదనపు క్యూ కాంప్లెక్స్, రూ.7.75 కోట్లతో కనకదుర్గా నగర్ ప్రవేశం వద్ద మహారాజ ద్వార నిర్మాణం, రూ.18.30 కోట్లతో మల్లికార్జున మహా మండపం వద్ద క్యూ కాంప్లెక్స్ మార్పు, రూ.19 కోట్లతో నూతన కేశ ఖండన శాల నిర్మాణం, రూ.10 కోట్లతో ప్రస్తుత గోశాల భవనాన్ని బహుళ సముదాయం మార్పు, రూ.5 కోట్లతో కొండపైన గ్రానైట్ రాతి యాగశాల నిర్మాణం, రూ.33 కోట్ల దేవస్థానం, ప్రైవేట్ భాగస్వామ్యంతో కనకదుర్గానగర్ వద్ద మల్టీ లెవల్ కారు పార్కింగ్ నిర్మాణం చేపట్టనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button