తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Government: కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ ఆరోగ్యశ్రీ కార్డులు.. రూ.25లక్షల వరకు ప్రీ ట్రీట్‌మెంట్

రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త. ఇక నుంచి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించనుంది. ఇందులో భాగంగా..నేటి నుంచి కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్య శ్రీ కార్డులను జగన్ సర్కార్ పంపిణీ చేయనుంది. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ALSO READ:  పవన్ ఇంటికి చంద్రబాబు.. సీట్లపై సుదీర్ఘ చర్చలు

ఆరోగ్య శ్రీ సేవలు, యాప్‌పై అవగాహన

ఆరోగ్యశ్రీ సేవలపై ప్రత్యేకంగా ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు, ఆశా వర్కర్లు, వలంటీ­ర్లు, మహిళా పోలీసులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతి­నిధులు స్వయంగా పరిశీలించి అవగాహన కల్పించనున్నారు. అదే విధంగా ఈ కొత్త ఆరోగ్య శ్రీ కార్డులో క్యూఆర్‌ కోడ్, లబ్ధిదారుడి ఫోటో, ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డులో పొందుపరిచిన లబ్ధిదారుడి ఆరోగ్య వివరాలతో ABHA ఐడీ ఉంటుంది. 4.52 కోట్ల మంది లబ్ధిదారులకు ఆరోగ్య శ్రీ సేవలు, ఆరోగ్య శ్రీ యాప్ పై విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్ క్షేత్ర స్థాయి వైద్య, ఆరోగ్య సిబ్బందికి దిశానిర్దేశం చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button