![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-20-at-10.38.16_3465c673.jpg)
Ayodhya Ram Mandir: ట్విట్టర్ను షేక్ చేస్తున్న ‘అయోధ్య’.. ట్రెండింగ్లో టాప్!
‘అంతా రామమయం ఈ జగమంతా రామమయం’ అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడినట్లుగా దేశమంతా రామమయమైంది. ప్రస్తుతం అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట కోసం భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎక్కడ చూసిన రామయ్య పేరే వినిపిస్తోంది. రాములవారి పేరును తలచుకుంటూ ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని వెల్లి విరుస్తున్నారు. మరో వైపు వేడుకలను వీక్షించేందుకు నిర్వాహకులు పల్లె, పట్టణాలను అట్టహాసంగా సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అయోధ్య టాప్ ట్రెండింగ్లో దూసుకెళ్తోంది. ట్విట్టర్లో ఏకంగా ఐదో స్థానంలో ట్రెండింగ్లో ఉండడంతో రామభక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: మంత్రి వెంకట్ రెడ్డి
దేశమంతటా లైవ్ టెలికాస్ట్..
అయోధ్యలో ఈనెల 22న శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను దేశమంతటా లైవ్ టెలికాస్ట్ చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. పట్టణాలు, పల్లెల్లో బూత్ లెవెల్లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి వేడుకలను లైవ్లో ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది. ప్రతి సామాన్యుడు ఉన్న చోటి నుంచే వేడుకలను వీక్షిస్తూ, బాల రాముడిని దర్శించుకునేలా చూడాలని పార్టీ భావిస్తోంది. అయితే ఇప్పటికే ఊరూ, వాడలో ఇప్పటికే ఇంటింటి అక్షింతల కార్యక్రమం పూర్తయింది.