![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/purandeshwari.webp)
BJP: టీడీపీతో పొత్తుపై తుది నిర్ణయం కేంద్రానిదే : పురంధేశ్వరి
జనసేన పార్టీతో బీజేపీ కలిసే ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. జనసేన పార్టీతోనే కలిసే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో దగ్గుబాటి పురంధేశ్వరి పర్యటించారు. ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గాలికొదిలేసి కక్ష పూరిత రాజకీయాలతో కాలం గడుపుతోందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు.
Also Read: మధ్యంతర బడ్జెట్ వర్సెస్ వార్షిక బడ్జెట్.. తేడా ఏంటో తెలుసా?
అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. టీడీపీతో పొత్తు ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుందా? లేదా అన్నది చంద్రబాబు కానీ..పవన్ కళ్యాన్ గానీ ఎక్కడా చెప్పలేదు. బీజేపీ అధిష్టానం కూడా ఎక్కడా పొత్తులపై నోరు విప్పలేదు. ఓటు బ్యాంకు చీల్చకుండా మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. దీనిపై ఇంత వరకు బీజేపీ జాతీయ నేతలు కూడా ఎక్కడా స్పందించలేదు.
Also Read: తాను, రేవంత్ రెడ్డి మిత్రులం… మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
అయితే లేటెస్ట్ గా ఏపీలో పొత్తులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందించారు. ఏపీలో తాము ఇప్పటికీ జనసేనతో పొత్తులో ఉన్నామని చెప్పారు. అయితే టీడీపీతో పొత్తుపై అధిష్టానానిదే తుది నిర్ణయమని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ అవినీతి, అక్రమాలు, అరాచకాలపై పోరాటం చేస్తామని దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు.