![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/టీడీపీ.jpg)
Chandrababu: అన్న క్యాంటీన్ ను సందర్శించిన చంద్రబాబు.. పార్టీ జెండా ఆవిష్కరణ
టీడీపీ అధినేత చంద్రబాబు కనిగిరిలో పర్యటిస్తున్నారు. రెండో రోజు పర్యటన సందర్భంగా చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ను సందర్శించారు. పేదలకు భోజనం అందించే అన్న క్యాంటీన్ ను కొనసాగిస్తుండడంపై చంద్రబాబు నిర్వాహకులను అభినందించారు. అంతేకాదు, స్వయంగా పలువురికి భోజనం వడ్డించారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట ఉగ్రనరసింహారెడ్డి, దామచర్ల జనార్దన్ వంటి ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు కూడా ఉన్నారు. అన్న క్యాంటీన్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు.
Also Read: తగ్గేదేలే అంటున్న అంగన్ వాడీలు… కఠిన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
ఎస్మాపై లోకేష్ స్పందన
గత కొన్ని వారాలుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయక సిబ్బందిపై ఏపీ ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించింది. దీనిపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిరసనలు చేయడం కూడా నేరమా? అని ప్రశ్నించారు. ఎస్మా ప్రయోగం, జీతంలో కోత నియంత పోకడలకు ప్రబల నిదర్శనమని తెలిపారు . తక్షణమే ప్రభుత్వం జీవో నెం.2ను వెనక్కి తీసుకోవాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. అంతిమంగా నెగ్గేది అంగన్వాడీలేనని అన్నారు. ఏపీలో అంగన్వాడీల ఉద్యమానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.