తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Chandrababu: రేపటి నుంచి చంద్రబాబు కుప్పం పర్యటన.. షెడ్యూల్ ఇదే!

టీడీపీ అధినేత చంద్రబాబు రేపటి నుంచి సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు గుడుపల్లె ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 6 గంటలకు టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీకానున్నారు. రాత్రి 8.45కి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం 11.50 గంటలకు శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రామకుప్పం పోలీస్ స్టేషన్‌ సెంటర్‌లో బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 5.15 గంటలకు కుప్పంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జనసేన నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు.

Also read: Rahul Gandhi: కొనసాగుతున్న రెజ్లర్ల నిరసన.. సంఘీభావం తెలిపిన రాహుల్ గాంధీ

సాయంత్రం 6.15 గంటలకు ఓ కన్వెన్షన్ హాల్‌లో టీడీపీ నేతలతో ప్రత్యేకంగా భేటీకానున్నారు. రాత్రి ఎనిమిదిన్నర గంటలకు కుప్పంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. ఈ నెల 30న మధ్యాహ్నం 12.20 గంటలకు పీఈఎస్ సమీపంలోని కురబ భవన్ వద్ద భక్త కనకదాస్ విగ్రహావిష్కరణ చేసి, అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.20 గంటలకు కుప్పం పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 2.45 గంటలకు కుప్పం మసీదులో ప్రార్థనలు జరిపి ముస్లిం, మైనార్టీలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం నాలుగున్నర గంటలకు మల్లానూరు బస్టాండ్ ఏరియాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button