తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Adudam Andhra: క్రీడలకు అడ్డా ఏపీ.. ఇదే సీఎం జగన్ కల.. నేటి నుంచే క్రీడా సంబరం

ఆంధ్రప్రదేశ్ ను క్రీడలకు కేంద్రంగా మార్చాలనే ఉద్దేశంతో సీఎం జగన్ క్రీడా రంగానికి విశేష ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలోనే కనీవినీ ఎరుగని విధంగా రాష్ట్రవ్యాప్తంగా అతి పెద్ద క్రీడా సంబరం నిర్వహిస్తున్నారు. అదే ‘ఆడుదాం ఆంధ్ర’. డిసెంబర్ 26 న మొదలై ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఈ క్రీడా సంబురాలు జరుగనున్నాయి. క్రీడోత్సవాల్లో పాల్గొనేందుకు మొత్తం 1.22 మంది రిజిస్ట్రేషన్ పొందడం విశేషం. ఆడుదాం ఆంధ్రా సంబురాలను సీఎం జగన్ మంగళవారం గుంటూరు జిల్లా నల్లపాడులో ప్రారంభించనున్నారు.

Also Read : చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం నేతలతో కేటీఆర్ భేటీ

ఇక నియోజకవర్గ కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రారంభించనుండగా.. మండల, గ్రామ, వార్డు స్థాయిల్లో ఆయా స్థాయి ప్రజాప్రతినిధులు ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీలను ప్రారంభించనున్నారు. క్రికెట్, ఖోఖో, బ్యాడ్మింటన్, కబడ్డీ తదితర క్రీడా పోటీలు జరగనున్నాయి. ఇండోర్, ఔట్ డోర్ క్రీడా పోటీలు జరుగుతాయి.

Also Read డార్లింగ్ ప్రభాస్ కు అయోధ్య నుంచి పిలుపు

సీఎం జగన్ లక్ష్యమిదే
గ్రామీణ ప్రాంత క్రీడాకారులను వెలికితీయడమే సీఎం జగన్ లక్ష్యం. క్రీడా యజ్ణంగా పిలుస్తున్న ఈ క్రీడా ఉత్సవంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. గల్లీ నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దేలా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. క్రీడలకు ఏపీ అడ్డా అని నిలిచేలా సీఎం జగన్ ప్రత్యేక చొరవ తీసుకుని క్రీడా రంగానికి విశేష ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఆడుదాం ఆంధ్రా వివరాలు
మొత్తం 47 రోజులు
5 దశల్లో నిర్వహణ
15,004 గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలు
కిట్లు: 5.09 లక్షలు
రిజస్టర్ అయిన మొత్తం క్రీడాకారులు, వీక్షకులు: 1.22 కోట్లు
పోటీ పడే క్రీడాకారులు: 34.19 లక్షల మంది
క్రీడా మైదానాలు: 9,478
క్రీడా సంబరాలకు అయ్యే వ్యయం: రూ.119 కోట్లు
బహుమతుల విలువ రూ.12.21 కోట్లు

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button