తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Janasena: జనసేనకు శుభవార్త.. శాశ్వత గుర్తుగా గాజుగ్లాసు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన జనసేన పార్టీకి భారీ శుభవార్త అందింది. ఆ పార్టీకి ఎన్నికల సంఘం గాజుగుర్తును శాశ్వత గుర్తుగా కేటాయించనుంది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు కూడా రానున్నాయి. రాజకీయ పార్టీలకు శాశ్వత గుర్తు పొందాలంటే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 6 శాతం ఓట్లు రావాలి. లేదా రెండు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ సీటు రావాలి. నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాలు,2 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.

ALSO READ: ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత ఓటు శాతం?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ జనసేన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 లోక్​సభ స్థానాల్లో జనసేన పోటీ చేయగా మొత్తం సీట్లలో విజయం సాధించింది. పిఠాపురం నుంచి బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్.. వైసీపీ నుంచి కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీతపై 70,729 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పార్టీ ఏర్పాటు చేసిన పదేళ్ల తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం స్థానాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాగా.. మచిలీపట్నం లోక్​సభ సెగ్మెంట్ నుంచి బాలశౌరి 2.20 లక్షలు, కాకినాడ నియోజకవర్గం నుంచి ఉదయ్ శ్రీరామ్ 2.29లక్షల మెజారిటీతో గెలుపొందారు. 21 సీట్లు రావటంతో జనసేనకు ప్రభుత్వంలో రెండు లేదా మూడు కేబినెట్ పదవులు, విప్, కార్పొరేషన్ పదవులు, ఎమ్మెల్సీలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button