తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Kuppam: రాజకీయాలకు చంద్రబాబు గుడ్ బై!… కుప్పం నుంచి బరిలోకి నారా భువనేశ్వరి!

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి కుప్పంలో నిజం గెలవాలి కార్యక్రమం చేపట్టారు. ‘ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ’ అంశంపై కుప్పం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read: లోక్ సభ బరిలో సెలబ్రెటీలు.. బీజేపీ తరపున యువరాజ్ సింగ్ పోటీ?

తనకు ఓ చిన్న ఆశ కలిగిందని కుప్పం నుంచి ఈసారి తాను పోటీ చేస్తానని… మీరు చంద్రబాబుకు మద్దతిస్తారా? లేక తనకు మద్దతిస్తారా? అని అక్కడ ఉన్న వారిని అడిగారు. అందుకు సమాధానంగా ఇద్దరి సపోర్టు చేస్తామని చెప్పారు. లేదు అలా కుదరదు ఇద్దరిలో ఒకరికే మద్దతివ్వలని నారా భువనేశ్వరి కోరారు. అయితే తాను ఇలా సరదాగా చేశానని… ఎప్పటికి చంద్రబాబే కుప్పం నుంచి పోటీ చేస్తారని స్పష్టంచేశారు. ప్రస్తుతం తాను చాలా హ్యాపీగా ఉన్నానని… రాజకీయాలకు తాను దూరంగా ఉంటానంటూ భువనేశ్వరి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button