తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Minister Kakani: చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్.. ఫోటోలకు పోజులు ఇస్తారని ఎద్దేవా

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి సవాల్ విసిరారు. రైతుల సంక్షేమంపై చర్చించేందుకు సిద్దమా అన్నారు. చంద్రబాబు కేవలం ఫోటోలకు పోజులు ఇచ్చే నేత మాత్రమేనని మంత్రి దుయ్యబట్టారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నాయుడు నేడు రైతులను ఉద్దరించే నాయకుడిలా మాట్లాడుతున్నారని.. రైతుల సంక్షేమం కోసం టీడీపీ హయాంలో ఏం జరిగింది.. వైసీపీ పాలనలో ఏం జరిగింది అనేదానిపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

చంద్రబాబు నాయుడు మాట్లాడినవి అవాస్తవాలని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. మిచౌంగ్ తుపాను పలు జిల్లాల్లో నష్టాన్ని కలిగించిందని.. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకొని తీర ప్రాంతాల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలించిందని చెప్పుకొచ్చారు. అందువల్లే పెద్ద నష్టం తప్పిందని.. అంతేకాకుండా ప్రజాజీవనానికి కూడా ఆటంకం లేకుండా చూశామన్నారు. విద్యుత్ కు సంబంధించి అపార నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. ఇతర జిల్లాల నుంచి సిబ్బందిని పిలిపించి పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా స్వయంగా తుపాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించారని చెప్పుకొచ్చారు. తుపాను బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారని మంత్రి చెప్పుకొచ్చారు.

Also read: BJP MLA: వైఎస్ఆర్ దేవుడన్న బీజేపీ ఎమ్మెల్యే.. వైరలవుతున్న వీడియో

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి చెప్పుకొచ్చారు. విపత్తులు వచ్చినప్పుడు ప్రజలను ఆదుకోకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు. టీడీపీ నాయకులు ఇళ్లలోంచి బయటకు రాలేదని చెప్పుకొచ్చారు. కేవలం మీడియా సమావేశాలకి పరిమితమయ్యారన్నారు. ఇందులో కూడా బెదిరింపులు.. బ్లాక్ మెయిల్ చేశారన్నారు. చంద్రబాబు హయాంలో రైతును పట్టించుకోలేదు. రైతులను మోసం చేయడం .. వ్యవసాయం దండగ.. ఉచిత విద్యుత్ .. కష్టం అంటూ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడారని గుర్తు చేశారు. ఇప్పుడు పరిహారంపై తప్పుడు లెక్కలు చెబుతున్నారన్నారు. చంద్రబాబు హయాంలో కంటే జగన్ అధికంగా పరిహారాన్ని చెల్లిస్తున్నారు. చంద్రబాబు కు పచ్చ మీడియా డైరెక్షన్ ఇస్తోందని.. వారు చెప్పినట్టు మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్ ఫుట్ సబ్సిడీని కూడా చంద్రబాబు దారి మళ్ళించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. పంట నష్టాలకు సంబంధించి రైతులకు బీమా చెల్లిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

బంగాళదుంపలను ఈ ప్రాంతంలో ఏమని అంటారని మాత్రమే జగన్ అడిగారని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఫోటోలకు ఫోజులు ఇచ్చే ముఖ్యమంత్రి అని చెప్పుకొచ్చారు. ప్రజలతో మమేకమయ్యే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని కొనియాడారు. పంట నష్టాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి వివరాలను రైతు భరోసా కేంద్రంలో ప్రదర్శిస్తున్నామని.. ఎవరికైనా అన్యాయం జరిగితే వెంటనే స్పందిస్తున్నట్లు స్పష్టం చేశారు. రైతులు పండించే పంటలకు మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పుకొచ్చారు. ఏదో ఒక విధంగా ప్రభుత్వం మీద బురద చల్లాలని తపనతోనే చంద్రబాబు .. లోకేశ్ విమర్శలు చేస్తున్నారన్నారు. లోకేశ్‌కు కందిపప్పు పెసరపప్పుకు తేడా తెలియదని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button