Minister Roja: తిరుమల శ్రీవారి సేవలో మంత్రి రోజా.. పోటీపై వైరల్ కామెంట్స్
మంత్రి రోజా నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం చేసి ప్రసాదం ఇచ్చారు.
ఆలయం నుంచి బయటకు వచ్చాక.. రోజా వైరల్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్ రాదని కొందరు అనడం.. శునకానందంతో చేస్తున్న ప్రచారం మాత్రమే అని అన్నారు. గడప గడపకు మొదలుకోని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో ముందు వరుసలో నేనే ఉంటున్నానన్నారు. రాబోయే ఎన్నికలలో తప్పకూండా పోటి చేస్తాను.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కే సీట్లు లేకుండా రోండేసీ నియోజకవర్గాలలో సర్వే చేయించుకుంటున్నారు. నేను జగనన్న సైనికురాలుని.. ఆయన మాటే నాకు శిరోధార్యం అంటూ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. పార్టీ కోసం కష్టపడే వారికి సీటు తప్పకుండా వస్తుందని అన్నారు. తాము మంత్రులం ఒకే నియోజకవర్గంలో ఉండలేం.. కదా, రెండు మూడు చోట్ల ప్రభావితం చేసే స్థితిలో ఉన్నామని రోజా అన్నారు. నగరి నియోజకవర్గానికి చాలా చేశానని.. ఆ సీటు విషయంలో గ్యారంటీగా ఆ టికెట్ నాకే వస్తుంది అందులో సందేహం లేదన్నారు.
Also read: Minister Venu Gopala Krishna: చంద్రబాబు వణికిపోతున్నారు.. మంత్రి సెటైర్లు
అయితే, గతంలో టీడీపీలో ఉన్నపుడు 2009లో చంద్రగిరిలో రోజా పోటీ చేసి ఓడినా మంచి స్థాయిలోనే ఓట్లు తెచ్చుకున్నారు. పైగా చంద్రగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఈసారి పోటీ చేసేందుకు సుముఖంగా లేరు. దీంతో అతడి స్థానంలో తన కుమారుడు మోహిత్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం ఉండటంతో రోజాకు అక్కడ టికెట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదని టాక్ వినిపిస్తుంది. అయితే, తాను మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్న ధీమాతో మంత్రి రోజా ఉన్నారు.