తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Pawan: తెలుగు ఐఏఎస్‌ కృష్ణతేజకు డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు

జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఎంపికైన తెలుగు ఐఏఎస్ కృష్ణతేజకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. కరోనా కష్టకాలంలో, కేరళ వరదల విపత్తు సమయంలో కృష్ణతేజ సేవలు మరిచిపోలేనివని గుర్తు చేశారు. ఆయన మరిన్ని సేవలందిస్తూ యువతకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కాగా.. కృష్ణతేజ ప్రస్తుతం కేరళలోని త్రిస్సూర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.

ALSO READ: ప్రభాస్ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నదే ‘కల్కి’లో చూపించా: నాగ్ అశ్విన్

పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ.. బాలల హక్కుల రక్షణలో దేశంలోనే త్రిసూర్‌ జిల్లాను అగ్రగామిగా నిలపడంతో జాతీయ బాలల హక్కుల కమిషన్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. 27న ఢిల్లీలో ఈ అవార్డును అందుకోనున్నారు. 2015 బ్యాచ్‌ ఐఏఎస్‌ అయిన కృష్ణతేజ 2023 మార్చిలో కేరళ రాష్ట్రం త్రిసూర్‌ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన 609 మంది విద్యార్థులను గుర్తించి దాతల సహకారంతో వారు ఉన్నత చదువులు చదివేలా చూశారు. అలాగే కరోనా సమయంలో భర్తలను పోగొట్టుకున్న 35 మంది వితంతువులకు ఇళ్లు నిర్మింపజేశారు. మరో 150 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button