తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Pawan: జనసేన ఘన విజయం.. మొక్కు చెల్లించుకున్న పవన్ కళ్యాణ్

అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసిన నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇవాళ అనకాపల్లిలో పర్యటించారు. పట్టణంలోని నూకాంబికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. తొలుత ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. పిఠాపురంలో తాను గెలిచి కూటమి అధికారంలోకి వస్తే నూకాంబికా అమ్మవారిని దర్శించుకుంటానని అనకాపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు.

ALSO READ: ఫ్యాన్స్‌లో తీవ్ర ఉత్కంఠ.. ఇవాళే ‘కల్కి’ ట్రైలర్ రిలీజ్

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి సంపూర్ణ విజయాన్ని నమోదు చేసింది. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 164 చోట్ల అఖండ విజయం సాధించింది. టీడీపీ సొంతంగా 134 స్థానాల్లో గెలుపొందగా, జనసేన 21, బీజేపీ 8 చోట్ల విజయం సాధించాయి. 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా పోటీచేసి అన్ని స్థానాల్లోనూ గెలుపొంది జనసేన రికార్డు సృష్టించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button