Pawan Kalyan: జనసేనలోకి జానీ మాస్టర్, పృధ్వీరాజ్… కండువా కప్పి ఆహ్వానించిన పవన్
ప్రముఖ కొరియో గ్రాఫర్ షేక్ జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. పవన్ కల్యాణ్ ఆయనకు కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా షేక్ జానీ మాస్టర్… జనసేనానికి ఖుర్ ఆన్ను బహూకరించారు.
నెల్లూరు జిల్లాకు చెందిన జానీ మాస్టర్ కొన్నిరోజులుగా అక్కడే ఉండి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజాసమస్యలపై పోరాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
Also Read: మాజీ సీఎం కేసీఆర్ ఎఫెక్ట్… సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీలో మార్చు
ప్రముఖ సినీ నటుడు పృధ్వీరాజ్ రాజకీయంగా పలు హాట్ కామెంట్లు చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ఆయన కూడా జనసేన పార్టీలో చేరారు. ఇటీవల పార్టీ కీలక నేత నాగబాబును కలిసిన ఆయన.. పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయన సొంత నియోజకవర్గమైన తాడెపల్లిగూడెం నుంచి జనసేన తరపున పోటీ చేయడానికి సిద్ధమైనట్లు సమచారం. కాగా, గత ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీలో చేరిన ఆయన జనసేన, పవన్ కల్యాణ్కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.