తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

TDP: వైఎస్ఆర్సీపీకి కౌంట్ డౌన్ ప్రారంభం… ‘రా కదలిరా’ సభలో చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నేడు అన్నమయ్య జిల్లా పీలేరులో ‘రా కదలిరా’ సభకు హాజరయ్యారు. పీలేరు జన గర్జన రాష్ట్రం అంతా ప్రతిధ్వనించాలని పిలుపునిచ్చారు. ప్రజాకోర్టులో జగన్ కు శిక్ష పడే సమయం సమీపించిందని, వైఎస్ఆర్సీపీకి కౌంట్ డౌన్ ప్రారంభం అయిందన్నారు. రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం అని, అందులో గెలిచేది టీడీపీ-జనసేన కూటమేనని చంద్రబాబు ఉద్ఘాటించారు.

Also Read:  ఏపీలో విద్యావ్యవస్థ సూపర్.. ఆర్ నారాయణమూర్తి కితాబు

భీమిలిలో సీఎం జగన్ ‘సిద్ధం’ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు. ఎన్నికలు వస్తేనే జగన్ ప్రజల్లోకి వస్తారని విమర్శించారు. మద్య నిషేధంపై మాట తప్పిన వ్యక్తి జగన్… అలాంటి వ్యక్తికి ఓటు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. జగన్ కు అభ్యర్థులు దొరకడంలేదని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తమ కసినంతా జగన్ పై చూపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ చరిత్ర ముగిసిపోతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button