తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

TDP: గంటా, పల్లాకు ముసుకుపోయిన దారులు.. వారి భవిష్యత్తు ఏంటో?

విశాఖలో గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావుకు రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. టీడీపీలో వారి పరిస్థితి ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే గంటా శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్ కెరీర్ ముగిసిందా? రాజకీయాలకు పెద్దపీట వేస్తున్నప్పటికీ ఏ సీటులో పోటీ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ లేని పరిస్థితి నెలకొంది. తమ కెరీర్‌లో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిని ఈ నేతలు ఊహించి ఉండరు.

Also read: Jagan Vs Sharmila: జగన్, షర్మిల మధ్య ఏం జరిగింది.. అసలు కథ ఏంటి?

గ‌త ఏడాది వైసీపీతో ట‌చ్‌లో ఉన్నందుకు గంటా శ్రీనివాసులు భారీగానే మూల్యం చెల్లించారట. ఆగస్ట్ 22- ఏప్రిల్ 23 మధ్య హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్‌సిపితో నిరంతరం చర్చలు జరిపినందుకు గంటా శ్రీనివాసరావుకు శిక్ష పడేలా అదే సమయంలో గంటా శ్రీనివాసులు టిడిపిలోనే ఉండేలా చంద్రబాబు నాయుడు చక్రం తిప్పారని టాక్. అయితే టీడీపీకి అభ్యర్థులు దొరకడం లేదు. ఈ నేపథ్యంలోనే గంటా శ్రీనివాసరావును వ్యూహత్మకంగా వాడుకునే పనిలో పడ్డారని తెలుస్తోంది. సీట్ల ఎంపికలో భాగంగా గంటాకు విశాఖ నుంచి కాకుండా విజయనగరం ఎంపీ లేదా అనకాపల్లి ఎంపీ సీటు లాంటి ఓడిపోయే స్థానాలను కేటాయించాలని నిర్ణయించుకున్నారట.

ఇక మరో టీడీపీ నేత పల్లా శ్రీనివాసులు గాజువాకలో వైసిపి నుండి పోటీ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ స్థానంలో పోటీపై త్వరలోనే క్లారిటీ రానుంది. అయితే ఇక్కడ పోటీ చేసేందుకు టీడీపీలో సరైన నేతలు లేకపోవడం ఆ పార్టీకి మైనస్. ప్రధానంగా యాదవ సంఘం వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గు చూపుతోంది. దానికి కారణం వైసిపి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు వల్ల పల్లా సన్నిహితులు, ఆ వర్గం వారు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button