తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

YS Sharmila: గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిశీలించిన షర్మిల… ప్రభుత్వ నిర్లక్ష్యంపట్ల మండిపాటు

గుండ్లకమ్మ ప్రాజెక్టును ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌కు సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంపట్ల షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ 750 కోట్లు ఖర్చు పెట్టి గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే మెయింటెనెన్స్ కోసం సంవత్సరానికి కోటి రూపాయలు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇవ్వలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: ఏపీలో విద్యావ్యవస్థ సూపర్.. ఆర్ నారాయణమూర్తి కితాబు

YSR కట్టిన గుండ్లకమ్మ ప్రాజెక్ట్ పూర్తిగా నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని తెలిపారు. టీడీపీ జలయజ్ఞం దోపిడీ అని అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడున్న ప్రభుత్వం నిర్వహణ విషయంలో పట్టించుకోక ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోయాయని విమర్శించారు. గేట్లు కొట్టుకుపోతుంటే సంబంధిత శాఖ మంత్రి మాత్రం సంక్రాంతి డ్యాన్సులు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. జగన్ కు మరమ్మత్తులు చేయించడానికి మనసు రావడం లేదని… ఇదేనా YSR ఆశయాలను నిలబెట్టడం అంటే అని ప్రశ్నించారు. YSR కట్టిన ప్రాజెక్ట్ ను పట్టించుకోని వారు ఆయన వారసులు ఎలా అవుతారో చెప్పాలని నిలదీశారు. ఇప్పటికైనా కళ్లు తెరవండని..లేదంటే ప్రాజెక్ట్ మొత్తం కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button