Amit shah: తమిళి సైని స్టేజీ మీదనే మందలించిన అమిత్ షా.. అసలేం జరిగింది?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే స్టేజీపై కేంద్ర మంత్రి అమిత్ షా, తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళసై సౌందర రాజన్ కూడా ఉన్నారు. అయితే తమిళిసైని అమిత్ షా స్టేజీ మీదనే ఏదో విషయంలో మందలించారు. స్టేజీపై అటుగా వెళ్తున్న తమిళిసైని అదే స్టేజీపై కూర్చుని అమిత్ షా దగ్గరకు పిలిచి మందలిస్తున్నట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళసై ఏదో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ అమిత్ షా మాత్రం ఆమె మాటను వినకుండా హెచ్చరిస్తున్నట్లుగా ఆ వీడియో ద్వారా తెలుస్తోంది.
ALSO READ: ఆధార్- రేషన్ కార్డ్ అనుసంధానానికి గడువు పొడగింపు
ఇటీవల తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విషయంలో తమిళపై చేసిన విమర్శలపై అమిత్ షా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, మాజీ అధ్యక్షురాలు తమిళిసై మధ్య విభేదాలు ముదురుతున్నాయి. తమిళసై ఇటీవల మాట్లాడుతూ.. బీజేపీలోకి సంఘ్ వ్యతిరేక శక్తులను తీసుకువచ్చారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై అన్నామలై, తమిళిసై మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని తమిళిసైని అమిత్ షా హెచ్చరించినట్లు తెలుస్తోంది.
fxa5es