![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/06/PTI06-09-2024-000138A-0_1717923808310_1717923828499.avif)
ఎన్డీయే లోక్సభా పక్ష నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి 7.15 నిమిషాలకు మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 30 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు. బీజేపీకి సొంతంగా మెజారిటీ రానుందన ఈసారి భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక శాఖలైన హోం, ఆర్థికం, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖలను అట్టిపెట్టుకుని.. కూటమిలోని పార్టీలకు కొన్ని మంత్రి పదవులు కేటాయించనుంది.
ALSO READ: తెలుగు రాష్ట్రాలకు ఐదు మంత్రి పదవులు
రాజ్నాథ్ సింగ్, అమిత్షా, గడ్కరీ, జైశంకర్, నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్ పురీ, జ్యోతిరాదిత్య సింథియా, అశ్వనీ వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయ, సీఆర్ పాటిల్, కిరణ్ రిజిజు మోదీ కేబినెట్లో మరోసారి ఉండనున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్, జేపీ నడ్డాను సైతం ఈసారి కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోనున్నారు. వీరితో పాటు భూపతివర్మ, అర్జున్ మేఘవాల్, మనోహర్లాల్ ఖట్టర్, రావు ఇంద్రజీత్ సింగ్, కమలాజీత్ సెహర్వాత్, భూపేంద్ర యాదవ్, ఎల్ మురగన్, ప్రహ్లాద్ జోషి, శోభా కర్లాంద్లజె, నిముబెన్ బంబానియా, జువల్ ఓరం, వి సోమన్న వంటి నేతలకు బెర్త్ దక్కింది. కూటమి పార్టీల నుంచి రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్ (టీడీపీ) హెచ్డీ కుమార స్వామి (జేడీఎస్), చిరాగ్ పాసవాన్, రామ్నాథ్ ఠాకూర్, జితన్ రాం మాంఝీ, జయంత్ చౌధరి (ఆర్ఎల్డీ), అనుప్రియా పటేల్, ప్రతాప్ రావు జాదవ్ (శివసేన- శిందే), లలన్ సింగ్, రామ్దాస్ అథవలె (రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా) వంటి పేర్లు వినిపిస్తున్నాయి.
One Comment